SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం

మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేడు 64వ రోజు ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ .

ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన లబ్ధి గురించి వివరిస్తూ వారి సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ప్రతిగడపలో ఆయనకు విశేష స్పందన లభిస్తోంది. పేదరిక నిర్మూలమే ప్రధాన ఎజెండాగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో ప్రతి గడపలో చిరునవ్వులు చిందిస్తూ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.


SAKSHITHA NEWS