ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్

Spread the love

హైదరాబాద్:
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది.

ఈ క్రమంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభ వార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఐ టిమ్స్ పరికారాలను బస్సుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

తొలుత పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, కార్డుల ద్వారా టికెట్ కోసం పేమెంట్ చేయవచ్చు. బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్య ఏర్పడుతుంది.

కండక్టర్ దగ్గర చిల్లర లేకపోవడంతో ప్రయాణికులతో ఇబ్బంది అవుతుంది. దీని వల్ల కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆన్‌లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటి నుంచో దీని గురించి చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం గతంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే విధానం బస్సుల్లో కూడా తీసుకురానుంది.

Related Posts

You cannot copy content of this page