నారాలోకేష్ “యువగళం” పాదయాత్ర “2800 కి.మీ” పూర్తి చేసుకున్న సందర్భంగా

Spread the love
నారాలోకేష్ గారి “యువగళం” పాదయాత్ర “2800 కి.మీ” పూర్తి చేసుకున్న సందర్భంగా.
జె.ఆర్.పురం హెడ్ క్వార్టర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు&అభిమానులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసిన కలిశెట్టి
06-09-2023
ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం
ఈరోజు నారాలోకేష్ గారి “యువగళం” పాదయాత్ర “2800 కి.మీ” పూర్తి చేసుకున్న సందర్భంగా..
జే.ఆర్.పురం హెడ్ క్వార్టర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు మాజీ డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు గారు.
ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ
206 రోజులు2800 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు,సహకరించిన నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు..
ఈ 2800 కిలోమీటర్ల మైలురాయిని 206 రోజుల్లో పూర్తిచేసిన నారా లోకేష్ గారికి,దీనికి సహకరించినటువంటి నియోజకవర్గాల ఇన్చార్జి లకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా ఈ యువగళం పాదయాత్రలో పడే ప్రతి అడుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి చేర్చే ఒక్కో మెట్టు లా భావిస్తున్నానని అన్నారు..
నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి అదేవిధంగా రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడంలో యువగళం పాదయాత్ర కీలక భూమిక పోషించబోతుందని అన్నారు
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్ణయించే గొప్ప నాయకుడుగా నారా లోకేష్ గారు తయారయ్యారని అన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈసందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు..

Related Posts

You cannot copy content of this page