నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

Spread the love

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

*
………

సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్*: పరిదిలోగల గోపీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక కాలోనివాసులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను ప్రారంభించడం జరిగిందని ఈ పనులు పూర్తయితే సుమారుగా గోపినగర్ కాలనీలో యు.జి.డి పైప్ లైన్ పనులు, సిసి రోడ్లు సుమారుగా పూర్తయినట్టేనని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. డ్రైనేజీ పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, వీరేశం గౌడ్, రాములు, నర్సింహాచారి, గౌతమ్ ముదిరాజ్, హైమద్, గౌసియా బేగం, రాజు, నవీన్, కిరణ్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page