నారాయణ కాలేజీలో ఘటనపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Spread the love

నారాయణ కాలేజీలో ఘటనపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. కాలేజీ నుంచి విద్యార్థికి టీసీ అందకపోవడంతో ప్రిన్సిపల్‌ను నిలదీసేందుకు వెళ్లిన సమయంలో విద్యార్థి నేత ఆత్యహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో విద్యార్థి నేత ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పక్కనే కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా అక్క‌డ దీపం వెలిగించి ఉండటంతో అది అంటుకొని అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్‌, మిత్రుడు కూడా గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page