ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన నరదాసు

Spread the love

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన నరదాసు

ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ఆ ప్రచారాలను తిప్పుకొట్టేందుకు సిద్ధం కావాలని బి.ఆర్.ఎస్ పార్టీ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పిలుపునిచ్చారు లక్షింపేటలో శాసనసభ్యులు ఎన్ దివాకర్ రావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారదాసు లక్ష్మణరావు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనానికి పంపించిన సందేశాన్ని వినిపించారు నారదాసు ఆత్మీయ సమ్మేళనం అంటే కార్యకర్తలకు ఆత్మీయ వేదిక లాంటిదని అన్నారు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని గుర్తు చేశారు అసత్యపు ప్రచారాలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమలను ప్రచారంలోకి తీసుకువెళ్లాలని లేకుంటే అబద్ధం నిజంగా మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారదాసు ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ప్రజల్లోకి వెళ్లాలన్నారు ప్రజలు చెబుతున్న సమస్యలను వినాలన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page