కారేపల్లి, మధిరలో నామ పర్యటన

Spread the love

Name tour in Karepalli, Madhira

కారేపల్లి, మధిరలో నామ పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులతో కలసి విస్తృతంగా పర్యటిస్తారని ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఖమ్మం కార్పొరేషన్ తో పాటు వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, అప్పాయిగూడెం, రొట్టమాకిరేవు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తో కలిసి పర్యటించి, ఆయా గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను నామ ప్రారంభిస్తారు.

అనంతరం జెడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజుతో కలసి, మధిర పట్టణంతో పాటు మండలంలోని మహాదేవపురం, చిలుకూరు, ఖమ్మంపాడు, నిధానపురం, మాటూరుపేట, మాటూరు తదితర గ్రామాల్లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి, ఓదారుస్తారని తెలిపింది. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, కార్య క్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page