మునుగోడు భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం – సామ రంగారెడ్డి

Spread the love

మునుగోడు భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం – సామ రంగారెడ్డి

చందానగర్ లోని స్వాగత్ హోటల్ లో శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి విచ్చేసారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే కాని పని, అభివృద్ధి గురించి గుర్తురని ఘాడ నిద్రలో కెసిఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు, ఇన్నాళ్లు మునుగోడు దిక్కు చూడని దొర ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తో బై ఎలక్షన్ వస్తుందని అక్కడి ప్రజలను మళ్ళీ మబ్యపెట్టడానికి జిత్తులు చేస్తున్నాడని అయిన తెలంగాణ లో ప్రజలు కెసిఆర్ దొర ని నమ్మే స్థితిలో లేరని, తప్పకుండా బీజేపీ కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు, ఆగస్ట్ 21 వ తేదీన మునుగోడు లో జరిగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి బీజేపీ కార్యకర్తకు పిలుపునిచ్చారు, అలాగే మునుగోడు లో జరిగే ఉప ఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని కావున బీజేపీని భారీ మెజారిటీ తో గెలిపించి ఫైనల్ లో బీజేపీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని మార్గదర్శకం చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు మువ్వ సత్యనారాయణ, డా. కె నరేష్, రవికుమార్ యాదవ్, , ప్రభాకర్ యాదవ్,మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి,మాజీ కార్పొరేటర్ జానకీ రామా రాజు, కాంచన కృష్ణ,, వసంత్ కుమార్, , జ్ఎం, రమేష్ సోమిశెట్టి, మారం వెంకట్, కుమార్ యాదవ్, మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page