SAKSHITHA NEWS

ఓపెన్ డ్రైనేజి పనులను ప్రారంభిస్తాం – మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల పట్టణ పరిధిలోని 1వ వార్డుశివనేని గూడెంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి పర్యటించారు.శివనేనిగూడెంలో ఓపెన్ డ్రైనేజి నిర్మాణ పనులకి నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చొరవ తో నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోపనులను ప్రారంభిస్తామని తెలిపారు.
అక్కడి స్థానిక రైతులతో మాట్లాడి స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని, సిసి రోడ్లు ఓపెన్ డ్రైనేజీలు కచ్చితంగా పూర్తి చేస్తామని వార్డులలో సమస్యలని కౌన్సిలర్లు నాయకులు నా దృష్టికి తీసుకు వస్తున్నారని ఒక్కొక్కటిగా ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటూ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు మెండే సైదులు, పొన్నం లక్ష్మయ్య,బొబ్బలి బిక్షం రెడ్డి, కన్నెబోయిన శ్రీశైలం, రుద్రవరం యాదయ్య,జగిని బిక్షం రెడ్డి,విఠల్ రెడ్డి, సతీష్ రెడ్డి, కృష్ణ, మహేష్, స్థానిక రైతులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS