SAKSHITHA NEWS

Municipal Chairman financial assistance of Rs.20,000 to Nisar's family

నిసార్ కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ రూ.20,000 ఆర్థిక సాయం


రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి

మున్సిపాలిటీ పరిధిలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ పక్కన డ్రైనేజీ కాలువలో దుర్మరణం పాలైన ఏడాదిన్నర బాలుడి కుటుంబాన్ని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి తండ్రి నిసార్ ను పరామర్శించిన అనంతరం అతనికి ఆర్థిక సహాయం 20 వేల రూపాయలను అందచేశారు. చిన్నారి బాలుడు ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడి మరణించడం బాధాకరమని అన్నారు. జరిగిన సంఘటనపై చైర్మన్ నరేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

. పరిసరాలను పరిశీలించిన అనంతరం ఒక కోటి రూపాయలకు పైగా వెచ్చించి డ్రైనేజీ కాలువను నిర్మిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS