నేటి నుంచి ఎంపీ నామ పర్యటన

Spread the love

నేటి నుంచి ఎంపీ నామ పర్యటన

ఖమ్మం బ్యూరో,

బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఈ నెల 19, 20 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 19వ తేదీ ఆదివారం ఉదయం సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తో కలిసి కల్లూరు మండలం లో కల్లూరు, కప్పలబంధం, చండ్రుపట్ల గ్రామాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అలానే మధ్యాహ్నం కొత్తగూడెం, జూలూరుపాడు మండలాల్లో పర్యటించి స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 20వ తేదీన మధిర మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి ఎంపీ నామ పర్యటిస్తారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ ఆఫీస్ కోరింది

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page