బొల్లాపల్లి మండలం, వెల్లటూరు జిల్లా పరిషత్ స్కూల్ ను సందర్శించిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

Spread the love

సాక్షిత * : స్కూల్ అభివృద్ధి అంశాలపై సమీక్ష
-మధ్యాహ్న భోజన పథకం పరిశీలన*
-విద్యార్థుల చేరికలు పెంచాలని, ఉన్నత చదువులు చదివేలా చూడాలని ఉపాధ్యాయులకి సూచన.*
పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి సహాయం అందిస్తానని ఎంపీ హామీ*
బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రారంభానికి వచ్చిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు.. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా నాయకులు, పాఠశాల సిబ్బంది తో సమావేశం అయ్యారు.
విద్యార్థులు ఎక్కువ మంది స్కూల్ లో చేరేలా, అలాగే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు పై చదువులు చదివేలా చూడాలని.. ఉపాధ్యాయులకు సూచించారు.
క్రీడా ప్రాంగణం అభివృద్ధి కి సహకరించాలని కోరగా అందుకు తప్పక నిధులు అందిస్తానని ఎంపీ తెలిపారు.

అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అక్కడి తీరును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page