దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! డాక్టర్ చెరుకు సుధాకర్

SAKSHITHA NEWS

దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో పాలక ఎన్ డి ఏ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించిన 26 ప్రతిపక్ష పార్టీల కూటమి బెంగుళూరు కేంద్రంగా డెవలప్ మెంట్ అలియన్స్ గా సంక్షిప్తంగా ఇండియాగా ఏర్పడింది. పోటీగా 39 పార్టీలతో ఎన్డీఏ సమావేశం పెట్టి అందులో కాంగ్రెస్ పై మోడీ విషం కక్కుతూ దేశంలో అస్తిరితకే కాంగ్రెస్ కూటమి ఏర్పరచిందని విషం చిమ్మినారు. విద్వేష రాజకీయాల విశ్వగురు నరేంద్ర మోడీ మరొకసారి తన సహజ అక్కసును ఇండియా కూటమి యెడల వెల్లడించి తన కురుచ రాజకీయ దృక్పధాన్ని వ్యక్తం చేశారు. అవినీతి కుటుంబ పాలన ప్రాంతీయ శక్తుల కలయిక కూటమి అని ఫెడరల్ స్ఫూర్తిని మరిచిపోతున్నారు. మోడీ పాలన అంటే అవినీతిపరులు ఎవరైనా తమ పార్టీలో చేరితే నిర్మావాస్య పౌడరు అని వెక్కిరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా చిన్నాచితక కుటుంబ అవినీతి గుంపులనే పోగేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అంటున్నారు. బిజెపి రెచ్చగొట్టిన రాజకీయాలతో మణిపూర్ లో విద్వేష మంటలు, అస్థిరత మోడీ అమిత్ షా పుణ్యమే కదా! అస్సాంలో ఈశాన్య రాష్ట్రాల్లో వారి కను సన్నల లోనే రోజు అల్లర్లు కొనసాగుతున్నాయి కదా! నిత్యం అస్థిరత అల్లర్లతో ఉన్నది బిజెపి పాలిత రాష్ట్రాలే కదా! ఇండియా కూటమిలో అందరినీ కలుపుకునే అనే పదమే నరేంద్ర మోడీకి మింగుడు పడడం లేదు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఒక్కో ప్రాంతంలో అక్కడి ప్రజల ప్రయోజనాల దృష్టితో పనిచేస్తూ ఉండవచ్చు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోతేనే కదా పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి ఇనుమడించేది. మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రతిపక్ష కూటమిపై ఎదురుదాడితో అధిగమించలేరు. విదేశాలలో ఉన్న భారత సంతతి ముందు, అంతర్జాతీయ మీడియా ముందు దేశంలో కొనసాగుతున్న విద్వేష రాజకీయాలని ప్రస్తావించడం విదేశీ జోక్యం అవుతుందా? భారత సరిహద్దు, రక్షణప్రయోజనాలను వివిధ దేశాలకు మెతక వైఖరితో కొనసాగించే బిజెపి కాంగ్రెస్ విదేశీ శక్తుల మద్దతు కోరినట్లు ఆరోపిస్తున్నారు. 75 ఏళ్ల భారతావనిలో ప్రజాస్వామ్య పరిపుష్టిని 9 ఏళ్లుగా బిజెపి బలహీనం చేస్తూ ఇప్పుడు 25 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశామని మోడీ అనడం ఎంత పెద్ద అబద్ధం! దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో బిజెపి బలహీనమై అధికారాన్ని కోల్పోతుంటే వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు ఎన్డీఏ కే అని మోడీ అనడం వాస్తవ దూరం. భారత ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం, ఫెడరల్ స్ఫూర్తిని నింపడానికి ఇండియా కూటమిని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page