దీక్షా శిబిరానికి ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆదిములపు ప్రకాష్ మాదిగ

Spread the love

ప్రకాశం జిల్లా….

విజన్ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు..ను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం…

ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆదిములపు ప్రకాష్ మాదిగ….

ఎర్రగొండపాలెం టిడిపి దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ…

మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ప్రభుత్వం నిరాహార దీక్షలకు పిలుపు ఇచ్చిన మేరకు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈరోజు ఎర్రగొండపాలెం లో టిడిపి నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆదిములపు ప్రకాష్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, చంద్రబాబు హయాంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగిందని, అలాగే ఎందరికో సామాజిక వర్గానికి చెందిన దళిత బిడ్డలు ఎందరో స్కిల్ డెవలప్మెంట్ లో అనేక రకాల వృత్తిపరమైన స్కిల్స్ నేర్చుకొని ఎందరో ఉద్యోగ అవకాశాలు పొందుకున్నారని, అలాగే ఎందరికో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనాలు అందజేయడం ద్వారా వారి కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని, అలాంటి విజన్ ఉన్న వ్యక్తిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. ఏ ప్రభుత్వంలోనైనా అక్రమాన్ని, అన్యాయాన్ని, ప్రశ్నించడానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page