గాయత్రి మెడోస్ అపార్ట్మెంట్స్ వద్ద ఎమ్మెల్యే పర్యటన…

గాయత్రి మెడోస్ అపార్ట్మెంట్స్ వద్ద ఎమ్మెల్యే పర్యటన…

SAKSHITHA NEWS

MLA's visit to Gayatri Meadows Apartments...

గాయత్రి మెడోస్ అపార్ట్మెంట్స్ వద్ద ఎమ్మెల్యే పర్యటన…

గాయపడ్డ మహిళకు పరామర్శ

తిరిగి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీ గాయత్రి మెడోస్ అపార్ట్మెంట్స్ వద్ద ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదం దృష్ట్యా చేపట్టనున్న చర్యలపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ట్రాఫిక్, మున్సిపాలిటీ అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన సవిత అనే మహిళను ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం అటువంటి ప్రమాదాలు తిరిగి జరగకుండా అపార్ట్మెంట్స్ వద్ద రోడ్డు వెడల్పు పనులు, డివైడర్ ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, బస్టాప్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

గాయపడ్డ మహిళలకు ప్రభుత్యం ద్వారా తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ భోగిశ్వర్లు, బాలనగర్ ట్రాఫిక్ ఏసీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్&బి డిఈ పాండురంగ విఠల్, సీఐ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, నాయకులు వెంకటేష్, మల్లేష్, పద్మారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS