SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా గాజులరామారం కైలాష్ హిల్స్, షిర్డీ హిల్స్ లలో ఎమ్మెల్యే పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు కైలాష్ హిల్స్, షిర్డీ హిల్స్ కాలనీల్లో పాదయాత్ర చేశారు. ఆయా కాలనీల్లో చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు.

మంజూరైన నిధులతో వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలనీల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆయా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మూసాఖాన్, ఇబ్రహీం, సాయి బాబా, దిలీప్, తిరుపతి, మహేష్, ఇమ్రాన్ బైగ్, నాగ భూషణం, చిన్నా చౌదరి, చెట్ల వెంకటేష్, అక్బర్, నవీన్ మరియు కాలనీల అధ్యక్షులు యాదయ్య యాదవ్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS