SAKSHITHA NEWS

MLA participated in awareness conference organized on seasonal diseases.

సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ( RMP & PMP ) ఆధ్వర్యంలో సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

కరోనా వంటి విపక్తర పరిస్తితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా డాక్టర్లు అందించిన సేవలు అనిర్వచనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ గ్రంధి, డాక్టర్ హుస్సేన్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ బాలలింగం, డాక్టర్ విఘ్నేష్, డాక్టర్ చక్రదర్, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ప్రభాకర్,

డాక్టర్ శౌకథ్, డాక్టర్ శోభన, డాక్టర్ రమ, డాక్టర్ శిరీష మరియు నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS