సిద్ధం సభకు సంసిద్ధం కండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

Spread the love

సిద్ధం సభకు సంసిద్ధం కండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
చండ్రాజుపాలెంలో కార్యకర్తలతో సిద్ధం సన్నాహక సమావేశం

మార్చి 3వ తేదీన మేదరమెట్ల వద్ద జరిగే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యల నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. చండ్రాజుపాలెంలో బెల్లంకొండ మండల నాయకులు, కార్యకర్తలతో సిద్ధం సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ..

రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన మూడు సిద్ధం సభలతో రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి ఎదురు లేదన్ని విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసంద్రంగా మారుతున్న సిద్ధం సభలతో ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. ప్రజల కోసం శ్రమించే నాయకుడు ప్రజల్లోకి వస్తే అభిమానం ఎలా ఉంటుందో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానంతోనే సిద్ధం సభలు.. ప్రతిపక్షాలకు గుబులు పుట్టిస్తున్నాయన్నారు. మార్చి 3వ తేదీన మేదరమెట్ల సమీపంలోని పిచ్చుకలగుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఈ సభకు కార్యకర్తలు లక్షలాదిగా తరలిరానున్నట్టు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి సిద్ధం సభు విజయవంతం చేయాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page