అగ్నిప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అగ్నిప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ

నామ ముత్తయ్య ట్రస్ట్ సౌజన్యౌతో నిత్యావసరాలు అందజేత…

విద్యుత్ ఘాతం తో శుక్రవారం పూరిళ్ళు దగ్దం అయిన బాధితురాలు కుంజా మంగమ్మ ను శనివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు.
భద్రాచలంలో జరిగిన గిరిజనోత్సవాన్ని తిలకించిన అనంతరం తిరుగు ప్రయాణంలో మెచ్చా నాగేశ్వర రావు అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం,వేదాంత పురం పంచాయితీ కార్యాలయం భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మల్లాయిగూడెం పంచాయితీ తాటి నాగుల గుంపు లో అగ్ని ప్రమాద బాధితురాలు ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమెను ఓదార్చి గృహలక్ష్మి పధకంలో పక్కా భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం తెరాస గ్రామీణ ప్రాంత నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో నామ ముత్తయ్య ట్రస్ట్,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆర్ధిక సౌజన్యం తో రూ.10 వేలు విలువ గల నిత్యావసర సామాగ్రిని అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామ మూర్తి,స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్,ఎమ్మెల్యే మెచ్చా ప్రధాన అనుచరుడు మందపాటి రాజమోహన్ రెడ్డి లు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page