డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు

Spread the love

నెల్లూరు జిల్లా

భారతరత్న, రాజ్యాంగ పితామహుడు ,న్యాయ శాస్త్ర కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి,ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యంగా స్త్రీలకు రాజ్యాంగబద్ధహక్కులను కల్పించడంలో అంబేద్కర్ చేసినటువంటి సేవలు శ్లాఘ నీయమన్నారు. ప్రపంచ మేధావిగా, అత్యున్నత విద్యావేత్తగా ఆయన ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అంబేద్కర్ జన్మదిన సందర్భంగా వైకాపా కార్యకర్తల నడుమ కేకును కట్ చేసి వారికి పంచి పెట్టారు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page