ఎమ్మెల్యే లాస్య నందిత గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Spread the love

ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి సాయన్న మరణం మరువకముందే కుటుంబంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నందిత ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నిజంగా ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని ..ఈ సందర్భంగా సాయన్న కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేసుకున్నారు.. ఎంతో సౌమ్యంగా అందరినీ అన్నా అంటూ పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కళ్ళ ముందు కనిపించే లాస్య నందితా ఇక లేదు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని విషాదం వ్యక్తం చేశారు.. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు….

Related Posts

You cannot copy content of this page