SAKSHITHA NEWS

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 47వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ గణేష్ నగర్ లో పాదయాత్ర…

కాలనీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 47వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ కాలనీ-1,2 లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపుగా పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న రోడ్లను తెలుసుకొని వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తమ కాలనీలో నెలకొన్న అనేక సమస్యలకు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపినందుకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, జయం చారి, మధుకర్ రెడ్డి, వెంకటేష్, అజయ్, కాలనీ వాసులు నర్సింహా రెడ్డి, భాస్కర్ గౌడ్, మురళి, శ్రీనివాస్, దుర్గా రావు, నర్సింహా రావు, లింగం యాదవ్, వనం శ్రీనివాస్, యాదగిరి, సంజీవ రెడ్డి, మాధవ రెడ్డి, చంద్రశేఖర్, రమ్య కృష్ణ, భవాని తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS