SAKSHITHA NEWS

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 45వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ డివిజన్ దత్తాత్రేయ నగర్ లో పాదయాత్ర…

అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 45వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ నగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. రూ.1 కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న మూడు రోడ్లు త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సురేందర్ రెడ్డి, నార్లకంటి బాలయ్య, మధుకర్ రెడ్డి, వెంకటేష్, బస్తీ వాసులు స్వామి, యాదగిరి, హుస్సేన్, గోవర్ధన్, చక్రపాణి, చారి, బాలచారి, జరీనా, సావిత్రి, పార్వతమ్మ, అమర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS