SAKSHITHA NEWS

తెలంగాణ ఆర్.ఎం.పి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…
జగద్గిరిగుట్ట లో ధన్వంతరి అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆర్.ఎం.పి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో పేద, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందించే ఆర్ఎంపి, పి.ఎం.పి వైద్యులపై ఈమధ్య తరచూ దాడులు జరగడం బాధాకరమని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాల అండగా ఉంటూ వారికి మద్దతుగా నిలిచామని, ప్రభుత్వ మార్పు తర్వాత ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్.ఎం.పి / పిఎంపి వైద్యుల పట్ల అణచివేత ధోరణి అవలంబించడం సిగ్గుచేటని, ఆర్.ఎం.పి/ పి ఎం పి వైద్యులకు తమ పూర్తి మద్దతు ఎల్లపుడూ ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ ఆర్.ఎం.పి/పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, సాజిద్, CPWA రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం, జగద్గిరిగుట్ట సంఘం అధ్యక్షులు వంగరి విష్ణు, ప్రధాన కార్యదర్శి రాము, కోశాధికారి రవి తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 30 At 3.29.35 Pm

SAKSHITHA NEWS