మీరందరి ఆశీస్సులు, మద్దతుతోనే ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

17 ఏళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం చేసిన పార్టీ బిఆర్ఎస్…. అర్చకుల బాగు కోరే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..*

జీహెచ్ఎంసీ లో అత్యధిక దూప దీప నైవేద్యాలు అందుకుంటున్న పురోహితులం మనమే : ధూపదీప నైవేద్య సంఘం అర్చకులు…..

132-జీడిమెట్ల డివిజన్ దుర్గా ఎస్టేట్ దుర్గా దేవాలయం (మూడు గుళ్ల) వద్ద ధూప దీప నైవేద్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ 6500 మంది అర్చకులకు రూపా దీప నైవేద్యల కోసం పదివేల రూపాయలు అందించిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఆ భగవంతుడు కృప, మీ అందరి ఆశీస్సుల వల్లే చరిత్రలో మిగిలిపోయే విధంగా 85576 ఓట్ల మెజార్టీతో నేను గెలిచానని, ఆ విజయంలో భాగస్వాములైన మీరందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో 132 డివిజన్ బిఆర్ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, కాలే నాగేష్, బాల మల్లేష్ , సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, గణేష్, ధూప దీప నైవేద్య సంఘం రాష్ట్ర కన్వీనర్, జిహెచ్ఎంసి అధ్యక్షులు శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆర్చీ రఘునాథ ఆచార్యులు, జిహెచ్ఎంసి ఉపాధ్యక్షులు చందు స్వామి, కరుణాకర శర్మ, రిపుంజయ శర్మ, ప్రవీణ్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page