ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్

Spread the love

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన బాలయ్య నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు…..


సాక్షిత : 125 గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా గతంలో ఏ నాయకుడు పాటించుకోని మా బాలయ్య నగర్ బస్తీని ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ప్రత్యేక శ్రాధ వహించి అభివృద్ధి చేసినందుకు గాను తమ కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను అర్హులైన కాలనీ వాసులుకు అందించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి కాలనీ వాసులు, ముదిరాజ్ సంఘం సభ్యులు అందరు అండగా నిలుస్తూ రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో గెలిపించుకుంటామని మా కాలనీ అభివృద్ధిని కొనసాగించుకుంటామని వాసులు అందరు ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేసారు.

ఈ కార్యక్రమంలో బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నగేష్, పార్వతి, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ పి గంగయ్య, జనరల్ సెక్రటరీ శివ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జి సాయిలు, మన్నే గిరి, వై రమేష్, బలమని, అశోక్, కృష్ణయ్య మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page