SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గిరినగర్ నగర్ లోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉదయ్ సేవియా ఫౌండేషన్ వారి సహకారంతో 4లక్షలు వెచ్చించి పాఠశాల భవనాన్ని పునర్నిమించిన సందర్బంగా ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బి .విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు, అనంతరం విద్యార్థులకు ఆడుకునేందుకు ఆట వస్తువులను, బాగ్స్ మరియు షూస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదువుకుని విజయాలు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్నవారికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు..

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆరవ శంకరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జయరాం, సీనియర్ నాయకులు జల్దా లక్ష్మీనాథ్, సుధాకర్, యాది రెడ్డి, మల్లేష్, కార్తీక్ గౌడ్, బాలు నేత, రమ్మీ గౌడ్, సాయి, పింటూ, అల్లాఉద్దీన్, తేజ యాదవ్, మహిళా నాయకులు మాజీ కౌన్సిలర్ చంద్రమ్మ, జ్యోతి, తారకరాని, భారతి, ఈశ్వరి, కరుణ, మరియు ఫౌండేషన్ సభ్యులు ఉదయ్ గంజి, రాజశేఖర్, సంజీవ్, క్రాంతి, సలీమా, లక్ష్మి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS