పదివేల రూపాయల వేతన ఒప్పందం కుదిర్చినందుకు కార్మిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Spread the love

పదివేల రూపాయల వేతన ఒప్పందం కుదిర్చినందుకు కార్మిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని సన్మానించిన వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లోని కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించి వారి వేతన ఒప్పందం రూ.10,000. కుదిర్చినందుకు యూనియన్ అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మిక శ్రేయస్సుకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలిపారు, కంపెనీ అభివృద్ధిలోకి చెందడానికి కార్మికుల కృషి మరువలేనిదని తెలిపారు, వారికి ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే యాజమాన్యంతో సంప్రదించి వాటి పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ శ్రీహరి వర్మ, సి.హెచ్.ఆర్ రామలింగేశ్వర శర్మ, ఆఫీస్ ఇంచార్జ్ సంజయ్ కుమార్, హెచ్ఆర్ సుబ్బారావు, అడ్మిన్ నరసింహమూర్తి రాజు, యూనియన్ అడ్వైజర్ ఉమామహేశ్వర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ప్రసాద్, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డ, శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణీంద్ర వర్మ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ట్రెజరర్ బి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page