సుచిత్ర అకాడమీ వారు నిర్వహించిన వెన్నెలగడ్డ చెరువు సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్

Spread the love

సుచిత్ర అకాడమీ వారు నిర్వహించిన వెన్నెలగడ్డ చెరువు సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియజికవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెలగడ్డ చెరువు వద్ద సుచిత్ర అకాడమీ వారు నిర్వహించిన చెరువుల సంరక్షణ కార్యక్రమంలో ఈ రోజు ముక్యతిదిగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ పాల్గొన్నారు. చెరువులను ఎలా సంరక్షించాలి అనే నేపథ్యంలో విద్యార్థులు నాటకాలు పాటల రూపంలో ప్రదర్శించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల సంరక్షణ అందరి బాధ్యత, చెరువు అభివృద్ధికి కృషి చేస్తూ సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను చేపడుతున్న విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో వెన్నెలగడ్డ చెరువును ట్యాంకుబండకు దీటుగా ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిదుతం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుచిత్ర అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ రాజు, ప్రిన్సిపాల్ దీపా కపూర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుంత సిద్దిరాములు, సంపత్ మాధవ రెడ్డి, గుమ్మడి మధుసూదన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, తోకల నగేష్ రెడ్డి, సమ్మయ్య నేత, యేసు, శ్రీను, కాలే నగేష్, గణేష్, బాల మల్లేష్, విజయ్ హరీష్, ప్రసాద్, అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

7ee2605b Fedb 42a6 83ff D1d76291b678

Related Posts

You cannot copy content of this page