కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Spread the love

కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *
సాక్షిత : కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ మొదలు నిత్యవసరాల సరుకుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆవేదన పడుతున్నా కూడా, లెక్క లేకుండా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు

గతంలో రూ. 410/- ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు 1105/- రూపాయలు దాటిపోయినా కూడా కనీస కనికరం లేకుండా మరో 50/- రూపాయలు పెంచి, బీజేపీ ప్రభుత్వం తన అహంకారాన్ని, నిరంకుశ ధోరణిని చాటుతోందని, అందుకు ప్రజలు తప్పకుండా బుద్ది చెప్తారని ఎమ్మెల్యే తెలిపారు

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ , అంబర్ పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page