SAKSHITHA NEWS

సాక్షిత : *తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తుందని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న పి.హెచ్సి సబ్ సెంటర్’కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల చింతకే మెరుగైన వైద్య సేవలను తీసుకువస్తుందన్నారు.

ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ సబ్ సెంటర్’లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్’ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంగారెడ్డి , బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి , వి.హనుమంత్ రెడ్డి (బొల్లారం మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు), స్థానిక వార్డ్ కౌన్సిలర్ చంద్రయ్య , గోపాలమ్మ (రెండో వార్డ్ కౌన్సిలర్), స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి , వి.యాదిరెడ్డి , బి.ఆర్.టి.యు నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , పాస్టర్లు శంకర్ , అబ్రహం , స్థానికులు నర్సింహా , కుమార్ , రాజు , అంజయ్య , విశ్వ , అమీర్ , గయూబ్ , అధికారులు, సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS