కంచికచర్ల కార్యాలయాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

కంచికచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శాసనసభ్యుల వారి కార్యాలయాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల పట్టణాభివృద్ధిలో భాగంగా.. స్థానికంగా MLA కార్యాలయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే నూతనంగా ఆఫీసు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఇప్పటివరకు నియోజకవర్గ కేంద్రమైన నందిగామ పట్టణంలోనే శాసనసభ్యుల వారి కార్యాలయం ఉండేది.. ఇకనుంచి కంచికచర్లలో కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంటాం.. వారంలో 3 రోజులు పాటు కంచికచర్ల కార్యాలయం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తాం ..

స్థానికంగా కార్యాలయ సిబ్బంది ప్రతి రోజూ అందుబాటులో ఉంటారు.. ప్రజల వినతులు స్వీకరించడం.. సి.యం.ఆర్.ఎఫ్. ఫైల్స్, ఇతరత్రా అప్లికేషన్లు ఇవ్వటానికి కంచికచర్ల -వీరులపాడు మండలాల ప్రజలు నందిగామ వరకు రానవసరం లేకుండా కంచికచర్ల పట్టణంలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఇకనుండి కంచికచర్ల -వీరులపాడు మండల అధికారులతో.. కంచికచర్ల పట్టణ అధికారులతో.. స్థానిక ప్రజాప్రతినిధులతో ఇక్కడి శాసనసభ్యుల వారి కార్యాలయంలోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తాం.. కంచికచర్ల పట్టణాభివృద్ధిలో స్థానిక కార్యాలయం కీలకంగా మారుతుంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి వేదాశ్వీర్వచనాలు అందజేసిన వేదపండితులు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page