రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు మసీదు బండ విలేజ్ లో గల స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని ,ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,స్మశాన వాటిక అభివృద్ధి పనులు , మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ,అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.


స్మశాన వాటికలలో అన్ని రకాల సకల సదుపాయాలతో ,అన్ని హంగులతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దామని, ఈ స్మశాన వాటికలో అంత్యక్రియల ఫ్లాట్ ఫారం, అడ్మినిస్ట్రేషన్ భవనం ,అంతర్గత రోడ్లు ,టాయిలెట్లు ,వాటర్ ఫౌంటైన్,స్నానాల గదులు , మనిషి జీవిత చరిత్ర సైకిల్ ( మనిషి పుట్టుక నుండి మరణించే వరకు తెలిపే జీవిత చక్రం ను చిత్రాల తో కూడిన గోడను మరియు స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించే విధంగా మొక్కలు నాటడం జరిగినది అని ,పర్యావరణ హితం తో నిర్మించడం జరిగినది అని, ప్రజలకు నేటి నుండి అందుబాటులోకి తీసుకురావడం జరిగినది అని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్ ,రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్,KN రాములు, కోడిచెర్ల రాములు, వేణు గోపాల్ రెడ్డి,నటరాజు, రమణయ్య, పవన్,నర్సింహ రెడ్డి, మహేష్, అలీ, మరియు కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page