ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

Spread the love

అశోక్ నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

గత మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని కేవలం రెండున్నర ఏళ్ళలోనే చేసి చూపించాను అని గర్వంగా చెప్పగలను.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం పూర్తి చేశాం. మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. అలాగే కూడళ్లలో సుందరీకరణ కోసం అద్భుతమైన కళాకృతులు ఏర్పాటుచేసి నగరం రూపురేఖలు మార్చాం. క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చేలా 4వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

ఇదే అభివృద్ధి కొనసాగి రాష్ట్రంలోనే మన తిరుపతి నెంబర్ వన్ సిటీగా నిలవాలంటే వచ్చే ఎన్నికల్లో మీ అందరి మద్దతు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

Related Posts

You cannot copy content of this page