గాంధీ కలలుగన్న స్వరాజ్యం జగనన్న అమలు చేస్తున్నారు – ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

Spread the love

*సాక్షితతిరుపతి నగరం:
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి తిమ్మినాయుడు పాలెంలో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ వారు నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి స్మృతి సభలో ఎమ్మెల్యే అభ్యర్థి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని తెలిపారు. జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటిచేయుచున్న తనని గెలిపించి తిరుపతి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో గాంధీ ట్రస్ట్ నిర్వహకులు పి.సి.రాయల్, కార్పొరేటర్లు బోకం అనీల్ కుమార్, రుద్రరాజు శ్రీదేవి, ఆదం సుదాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 30 At 7.14.49 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page