మధురానగర్లో సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

Spread the love

తిరుపతి అభివృద్దికి కృషి చేస్తున్నాము : మేయర్ శిరీష
తిరుపతి 44వ డివిజన్ మధురా నగర్లో నూతనంగ నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్థానిక కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ 41 లక్షల రూపాయల వ్యయంతో మధురా నగర్లో నిర్మించిన సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజి పైప్ లైనును నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల ముందు వచ్చిన అధిక వర్షంలో మధురా నగర్లో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, కౌన్సిల్ ఆమోదంతో నూతన డ్రైనేజిని నిర్మించడం జరిగిందన్నారు.

తిరుపతి అభివృద్ధికి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సూచనలతో తమ కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ సహకారంతో నిరంతరం పని చేస్తున్నామని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, నాగిరెడ్డి, దేవదానం, యోగాంజనేయ రెడ్డి, అశోక్ రెడ్డి, లవ్లీ వెంకటేష్, తలారి రాజేంద్ర, శ్యామల, పుణిత, కాంట్రాక్టర్ బొగ్గుల వెంకటేష్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page