జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష

Spread the love

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష
జగనన్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటిలో వివరించాము
ఎమ్మెల్యే భూమన
ప్రజల సమ్మతితో ప్రతి ఇంటికి స్టిక్కర్లు’అందుచేత
నగర మేయర్ డాక్టర్ శిరీష
మరోసారి జగన్ కు అండగా ఉంటామని ప్రజలు సృష్టికరణ


*సాక్షిత : *జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమం ను 27వ డివిజన్ తాతా నగర్ నందు సాయంత్రం తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ ముద్ర నారాయణ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష కరపత్రాలను పంచుతూ అందరికీ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు ఇస్తారా అని తెలుసుకొని వారి స్పందనను నమోదు చేశారు. అనంతరం వారి అనుమతితో వారి ఇంటికి “జగనన్నే మా భవిష్యత్” స్టిక్కర్లను అతికించారు. మళ్ళీ సంక్షేమ సారధి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయాని లేని పక్షంలో ఆగిపోతాయాని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.


మేయర్ మాట్లాడుతూ ప్రజల స్పందన బాగుందని, గత ప్రభుత్వం కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో లబ్ధి పొందుతున్నారని, ప్రజలు కూడా జగనన్నే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ, వై.ఎస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు దొడ్డ రెడ్డి సిద్ధారెడ్డి, గోపాల్ రెడ్డి, తొండము నాటి వెంకటేష్ రెడ్డి, చింతా భరణి యాదవ్, చింతా రమేష్, హేమలత, కార్యకర్తలు, వార్డు కన్వీనర్లు, గృహ సారుదులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page