రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా

Spread the love

ప్రకాశం జిల్లా

రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా
……………………………….
ఈ నెల 6వ తేది నుండి ప్రారంభమయ్యే శ్రీ నెమలిగుండ్ల రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ముందస్తు ఏర్పాట్లును ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆదివారం పరిశీలించారు. రాచర్ల మండలం జే.పి.చెరువు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో వెలసిన ప్రముఖ పుణ్య క్షేత్రమైన రంగస్వామి ఆలయంలో జరిగే ఏర్పాట్లు ను ఎమ్మెల్యే అన్నా పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆలయ అధికారులకు, ఆలయ కమిటీ నిర్వాహాకులకు, పలు శాఖల అధికారులకు ఎమ్మెల్యే అన్నా పలు సూచనలు, సలహాలు అందించారు.అనంతరం బ్రహ్మోత్సవాల సందర్బంగా జరిగే అంకురార్పణ, కళ్యాణం, తెప్పోత్సవం, గరుడోత్సవం, రధోత్సవం వంటి కార్యక్రమాలకు ఎటువంటి అవాంతరాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మంచినీళ్లు, భోజన వసతి మరియు ఇతర సౌకర్యలను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page