సాక్షితమహబూబ్ నగర్:- దేశంలో బీజేపీ పాలనకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను చీల్చి కూల్చేది మోడీ సర్కార్ అని ఫైర్ అయ్యారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ప్రధాని మోడీ కుట్రలు, పాచికలు తెలంగాణలో పారలేదని అన్నారు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు సాగనివ్వరని హెచ్చరించారు. తెలంగాణలో అమలు అవుతోన్న ఎన్నో పథకాలు మాకు కావాలని దేశంలో ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కానీ, బీజేపీ విధానాల వల్ల భారత్ ఇంకా అభివృద్ధి చెందడం లేదని ధ్వజమెత్తారు.
BRS ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ కుట్ర: మంత్రి శ్రీనివాస్
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
SAKSHITHA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
SAKSHITHA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సాక్షిత కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి…