SAKSHITHA NEWS

Dr. Minister Puvwada unveiled the statue of BR Ambedkar

డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణకర్త డా. బీఆర్. అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు.

వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు. అంబెడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS