SAKSHITHA NEWS

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

  • కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి బుధవారం అందజేశారు.

కారేపల్లి మండలం గంగారాం తండా కు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె అశ్విని వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున రు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఎక్స్ గ్రేషియా తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు. అశ్విని మరణంతో దేశం, ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అధికారులు తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS