భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Spread the love

భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్


మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యాక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తర్వాత డబుల్‌ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. సుభాష్‌కాలనీ పక్కనే గల మినీ స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు.

పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్దార్‌‌, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page