SAKSHITHA NEWS

బీసీలకు పెద్దపీట వేసిన మంత్రి కాకాణి

. సాధారణ జర్నలిస్టుగా ఉన్న నన్ను రాజకీయంగా తీర్చిదిద్దారు

… కృతజ్ఞతలు తెలియజేసిన వైసిపి నేత వెంకట శేషయ్య

రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం లో బీసీలకు పెద్ద పీట వేసి తగు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆయనకి ఎప్పుడు తాము కృతజ్ఞతగా ఉంటామని మాజీ జెడ్పిటిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట శేషయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ జర్నలిస్టుగా ఉన్న తనను గుర్తించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటాచలం జడ్పిటిసిగా టిక్కెట్ మంజూరు చేసి గెలిపించుకున్న ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డికి దక్కుతుందన్నారు. బీసీ కులానికి సంబంధించి పనిచేస్తున్న వారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారని బీసీల సంక్షేమ ధ్యేయంగా ఆయన నిరంతరం పనిచేశారన్నారు.

మాజీ జెడ్పిటిసి గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన మంత్రి కాకానికి కృతజ్ఞతలు తెలియజేసారు. బీసీ అయిన తన లక్ష్యంగా చేసుకొని టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు కుట్రలు కుతంత్రాలు చేసిన తనకి ఎప్పుడు మంత్రి అండగా నిలిచారన్నారు. జీవితాంతం సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి కాకానికి అండగా ఉంటారని తెలిపారు. 2024లో మంత్రి కాకానిని హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నిరంతరం కష్టపడతామని పేర్కొన్నారు ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తలమంచి సురేంద్రబాబు , ఉప్పల శంకరయ్య గౌడ్ , అడపాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS