ఎమ్మెల్యేను కలిసిన వడ్డెర సంఘం సభ్యులు.

Spread the love


Members of the Vaddera community who met the MLA.

ఎమ్మెల్యేను కలిసిన వడ్డెర సంఘం సభ్యులు

సాక్షిత : అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య మరియు సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వడ్డెర కులస్తులం రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు గుట్టలు కానీ, మైనింగ్ కానీ ఏదీ లేనందున గత 30 ఏళ్ల నుండి గాజులరామారం ప్రాంతంలో క్వారీలలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అట్టి క్వారీ గుంతలను పూడ్చి ఇతర భవన నిర్మాణ సముదాయాల నుండి వచ్చిన రాళ్ళను ఇక్కడ వేసుకొని రాళ్ళు కొట్టుకొని, కంకర, బెందడి చేసుకొని జీవిస్తున్నామని,

అయితే గాజులరామారం ప్రాంతంలో పూడ్చిన స్థలాన్ని కొందరు వ్యక్తులు పని చేయవద్దని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనుక తమ జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా కొంత స్థలాన్ని కేటాయించి అందులో పనులు చేసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సహకారం అందించాలని ఎమ్మెల్యే కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే అందుకు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు తిరుపతి, రాష్ట్ర నాయకులు దండుగుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page