SAKSHITHA NEWS

బిర్రం హేమశ్రీకి.. పుట్టినరోజు శుభాకాంక్షలు .. అందజేసిన క్రికెట్ టీం సభ్యులు

ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.. టెలికం అడ్వైజరీ కమిటీ నెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు

మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో.. గ్రామస్తుల చేయూతతో… రెండోరోజు విజయవంతంగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించటం జరుగుతుందని, గాండ్లగూడెం క్రికెట్ టీం నిర్వాహకులు తెలిపారు. సీనియర్ నాయకులు టెలికం అడ్వైజరీ కమిటీ నెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు మనవరాలు హేమ శ్రీ పుట్టినరోజు శుభ సందర్భంగా స్వయంగా క్రికెట్ టోర్నమెంట్ విచ్చేసి క్రీడాకారులకు దాదాపు 100 మందికి.. ఆఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ తోపాటు ఒక మామిడిపండును బహుకరణ చేశారు. ముందుగా ఉదయం సమయంలో హాజరైన పెదవాగు ప్రాజెక్ట్ సి టీం, అలాగే అశ్వరావుపేట టీం సభ్యులను పరిచయ కార్యక్రమం చేసుకుని మ్యాచ్.. ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మనవరాలి పుట్టినరోజు శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్నపాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కమిటీ ఆహ్వాన మేరకు.. ఇక్కడికి విచ్చేసి కమిటీ సభ్యులకు ఆశీస్సులు అందజేసి సభ్యులకు ప్రోత్సాహం అందజేసేందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రికెట్ సభ్యులందరూ మా మనవరాలుకు ఆశీస్సులు అందజేయడం ఆనందంగా ఉందని.. తెలిపారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని.. ఆటలు ఆడడం ఎంతో ఉపయోగకరమని చక్కగా ఆడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో… గాండ్లగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మాలోతు చంద్రకళ,
మాలోతు ఆలీబాబు, కోనుసోతు నవీన్ నాయక్, వంశీ, చందు, శ్రీహరి, రామకృష్ణ, శ్రీకాంత్, రవి, బానోతు రాంజీ, లాలు, ప్రసాద్, క్రికెట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS