కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు….

Spread the love

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ ప్రతినిధులు*


సాక్షిత : హైదరాబాద్ ముఖ్యమంత్రి నివాసంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం భారతరాష్ట్ర సమితి కు చెందిన సుమారు 1000 మంది ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పి ఆహ్వానం పలికారు.
నియోజకవర్గం లో 4 గురు జడ్పీటీసీలు లింగాలఘనపూర్ జడ్పీటీసీ వంశీ చందర్ రెడ్డి ,రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్ ,జఫ్ఫర్గఢ్ జడ్పీటీసీ బేబీ శ్రీనివాస్ ,ధర్మసాగర్ జడ్పీటీసీ పిట్టల శ్రీలత సత్యనారాయణ పార్టీ లో చేరారు.అదేవిదంగా వేలేరు ఎంపీపీ సమ్మి రెడ్డి చిల్పూరు ఎంపీపీ సరితా బాలరాజు ,ఘనపూర్ ఎంపీపీ రేఖా గట్టయ్య ,జఫ్ఫర్గఢ్ ఎంపీపీ సుదర్శన్ పార్టీలో చేరారు.పీఏసీఎస్ చైర్మన్లు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు,వైస్ ఎంపీపీ లు,అనేకమంది ఎంపీటీసీ లు,సర్పంచులు కడియం శ్రీహరి నాయకత్వంలో డా.కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ దాదాపు 70 శాతం బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లో నా పై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారందరికీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page