కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Spread the love

-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు

……

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు మహ్మద్ జావేద్ లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలోకి ఆకర్షితులు అవుతున్నారని ఒక్క కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని భావించి భారీగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. అందరం కలసి కట్టుగా పని చేసి ఖమ్మం లోక్ సభ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


ఖమ్మం నగర 42 వ దివిజన్ కార్పొరేటర్ పాకాలపాటి విజయనిర్మల ఆద్వర్యంలో మాజి కౌన్సిలర్ మజీద్, పర్వీన్ లు, 58 వ డివిజన్ నుండి తంగిరాల శ్రీకాంత్ ఆద్వర్యంలో వత్సవాయి సతీష్, రేగల్ల కృష్ణ తోపాటు సుమారు 250 మంది యువకులు, రఘునాథపాలెం మండలం బూడిదంపాడు నుండి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో మాజి ఎంపీటీసీ కేలోత్ బాసు, శంకర్ శ్రీను వీరితోపాటు 1O కుటుంబాల వారు మరియు పరికలబోడు తండా నుండి భన్సిలాల్ ఆద్వర్యంలో 20 కుటుంబాల వారు చేరినారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు చోటా బాబా , గౌస్ పాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page