SAKSHITHA NEWS

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు ఉన్న లింక్ రోడ్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్ క్లీన్ డ్రైవ్ ప్రోగ్రామ్ లో కాలనీ వాసులతో కలసి పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నిత్యం లింక్ రోడ్ ను ఎక్కువ మంది ప్రజలు ఉదయం సాయంత్రం ఆరోగ్యం కొరకు వాకింగ్ మరియు సైక్లింగ్ చేస్తున్నారని

, అందుకు అనుగుణంగా రోడ్లను శుభ్రత పాటిస్తున్నమని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎస్ అర్ పి సత్యనారాయణ, ఎస్ ఎఫ్ ఐ శ్రీకాంత్, రాంకీ సిబ్బంది, నక్క శ్రీనివాస్, సత్యనారాయణ, హబీబ్, ఏళ్ల స్వామి, కృష్ణ రెడ్డి, ఇమ్రాన్, విమల, రేణుక తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS