గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ లో గల పలు సమస్యలు

Spread the love


Many problems in Sai Vaibhav Colony under Gachibowli Division

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మరియు మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి కాలనీ లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గతంలో వర్షాలకు నాల పొంగి కాలనీ అంతా ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి విదితమే నని ,ఇట్టి విషయం ను దృష్టిలో పెట్టుకొని కాలనీ లో గల నాల విస్తరణను పొడిగించాలని అధికారులను ఆదేశించారు, నాల విస్తరణ మరియు పొడిగింపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కలిపించాలని అధికారుల కు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశించారు,

నాల పొంగకుండా రాబోయే వర్షకాలం లోపు పనులు పూర్తి చేయాలని, అదేవిధంగా కాలనీ లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు

.

అదేవిధంగా

సాయి వైభవ్ కాలనీ మరియు సాయి ఐశ్వర్య కాలనీ ల మధ్య రూ. 30 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న లింక్ (సీసీ) రోడ్డు నిర్మాణ పనులను GHMC పరిశీలించి అధికారులకు పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సాయి వైభవ్ కాలనీ లో సీసీ రోడ్ల ను వేసుకోవడం చాల సంతోషకరం అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని

,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్ DE విశాలాక్షి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ TPS రమేష్ తెరాస నాయకులు రమేష్, జగదీష్,
మరియు


సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, పద్మావతి జనరల్ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్, సుధాకర్ ,బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page