మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల పలు సమస్యలు

Spread the love

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

ఈ సంధర్భంగాఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, గోకుల్ ప్లాట్స్ కాలనీ అభివృద్ధి కి శాయాషెక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియచేసారు, త్వరలోనే కాలనీల లో పర్యటిస్తామని, నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సాంబయ్య, సంజీవ రెడ్డి, శివాజీ,దుర్గారావు,ప్రకాష్ రెడ్డి, పంతులు, హరి, దేవా, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మనోజ్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,

Whatsapp Image 2024 01 29 At 5.06.15 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page